ఉప్పల్ టెస్ట్: ఇన్నింగ్స్‌ 135 రన్స్ తో భారత్ గెలుపు

 

 

India beat Australia in Hyderabad |  India beat Australia| Hyderabad Test India beat Australia

 

 

ఉప్పల్ టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆసిస్ బ్యాట్స్ మెన్‌లు పెవిలియన్ బాటపట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే ఆసిస్ కుప్పకూలింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

 

టీంఇండియా బౌలర్లు అశ్విన్‌కు ఐదు వికెట్లు, జడేజాకు మూడు వికెట్లు, ఇశాంత్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆసిస్‌పై భారత్‌కు ఇది రెండో విజయం. రెండో టెస్టులో ద్విశతకం చేసిన ఛటేశ్వర్‌పుజారాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ' దక్కింది. మరోవైపు కెప్టెన్‌గా టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించి ధోని రికార్డు సృష్టించాడు.